UPDATES  

NEWS

టేకులపల్లి పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించిన ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి గ్రామ పంచాయతీ బుధవారం మూడో దఫా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టి జి టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, భద్రాది జిల్లా జిఎల్ ఎస్. జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ కుటుంబ సమేతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని,దేశ పురోగతికి మరియు గ్రామాభివృద్ధికి పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ తెలిపారు.

ప్రశాంతంగా ముగిసిన తుదివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు

భద్రాద్రి జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం తో ప్రశాంతంగా ముగిశాయి.భద్రాద్రి జిల్లాలో మొత్తం 7 మండలాల్లో పోలింగ్ జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం..