UPDATES  

NEWS

దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

 వాములో ఎన్నో ఔషధ గుణాలు..

వంటింట్లో ఉండే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్తి సమస్యను దూరం చేయటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్నం అరగకపోవడం, నిద్రలేమి, నీరసం, బిపి, మలబద్ధకం వంటి సమస్యలు వాము ద్వారా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వామును రోజూ ఆహారంలో తీసుకోవటం ద్వారా శరీరం తేలికగా ఉంటుంది. పిల్లల ఆహారంలో దీనిని వాడటం ద్వారా కడుపులో నులిపురుగులు పెరగవు. పేగుల్లో, జీర్ణాశయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. విరేచనానికి ఇబ్బంది పడేవారు వాము కషాయాన్ని, ఆకును వాడటం మంచిది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కాసింత నోట్లో వేసుకుని పడుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును వాము కరిగిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది.
వాము, మిరియాలు వేర్వేరుగా వేయించి కొద్దిగా నీరు కలిపి నూరి, వడకట్టి పిల్లలకు తాగిస్తే అజీర్తి, విరేచనాలు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. వేడి అన్నంపై కొద్దిగా వాము పొడిని, కొద్దిగా మిరియాల పొడిని తగినంత ఉప్పు వేసి కలిపి తీసుకుంటే అజీర్తిని దూరం చేస్తుంది. కషాయంగా తీసుకోవడటం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి. తేనెతో కలిపిగానీ, పొడిగానీ తీసుకోవటం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి. నిప్పులపై వాము వేసి ఆ పొగ పీల్చితే జలుబు, ముక్కుదిబ్బడ తగ్గుతాయి. లోపల పేరుకున్న కఫం పడిపోతుంది. వాము ఆకును కూరగా చేసుకుని తింటే శ్లేష్మం నివారణ అవుతుంది. వాము, ఉప్పు, మిరియాలు కలిపి నూరి పరగడుపున తింటే రక్తహీనత నయమవుతుంది. శీతాకాలంలో ఎదుర య్యే జీర్ణ, శ్వాస సమస్యలకు, శరీర నొప్పులకు వాము బాగా పనికొస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest