UPDATES  

NEWS

కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే..?? CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన.! గిరిజన సంక్షేమ భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలి: టిపిటిఎఫ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి: జిల్లా కార్యదర్శి ఎస్.శైలజ మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి ఆహ్వానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా అడ్వకేట్ మారపాక రమేష్ కుమార్ నియామకం ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి

 మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ఆరోగ్య పరీక్షలు. 

 సైదాపూర్ : జనవరి:9 ( తెలంగాణ వాణి విలేకరి )

సైదాపూర్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య పర్యవేక్షకుడు ఎస్ రమేష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్పతి ప్రమేల ఆదేశాల మేరకు మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని జిల్లా పరిషత్తు, పాఠశాలలో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందు గోళీలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

  పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికుల బరువు, బిపి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ద్వారా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు గ్రామాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియంత్రణకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వంట కార్మికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మారుతి , ఉపాధ్యాయులు రామకృష్ణ, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి వాణి, ఏఎన్ఎం సులోచన, ఆశ వర్కర్లు సుజాత, భారత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest