ఇటీవల సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీగా నియమితులైన డా.బుద్ధ ప్రకాష్ జ్యోతి కొత్తగూడెం పర్యటనలో భాగంగా పాత అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.2007లో భద్రాచలం ఐటిడిఏ పీఓ పనిచేసిన సమయంలో గిరిజన విద్యా కళాశాల ప్రిన్సిపాల్గా సేవలందించిన డా. ప్రభుదయాల్ నివాసాన్ని సందర్శించారు. దయాల్ బాగోగులు తెలుసుకుని,ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుని వధూవరులను ఆశీర్వదించారు. తన హయాంలో కళాశాలకు జాతీయ ఉపాధ్యాయ మండలి గుర్తింపు,బీఈడీ 200 సీట్లు,నూతన భవనాలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం,అలాగే ఇగ్నో (IGNOU) స్టడీ సెంటర్ ఏర్పాటైన విషయాలను గుర్తుచేశారు.కళాశాల అభివృద్ధికి దయాల్ చేసిన సేవలను అభినందించిన సియండి, అంకితభావంతో పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దయాల్ కుటుంబ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.
Post Views: 5