UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 గురుకులాల్లో మిగిలిన పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ పద్ధతిలో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో మిగిలిన పోస్టులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు వెంటనే అన్ని పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్‌ను, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని సూచించింది. తదుపరి చేపట్టే విచారణలోగా ప్రతివాదలు అందుకు సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.

కాగా, గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, పీజీటీ, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్లు తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆ నియామకాల్లో ఎగువ, దిగువ భర్తీ చేయాల్సి ఉన్నా అన్నింటికీ ఒకేసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఒకేసారి మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోవడంత మిగిలిన పోస్టులు భర్తీ కాకుండా అలాగే మిగిలిపోయాయి. దీంతో అలా మిగిలిపోయిన పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని కొరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest