ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఇటీవల మేడారం సబ్ స్టేషన్ దగ్గర గల టన్నెల్ లో 820 మీటర్ల కాపర్ వైర్ దొంగిలించి ఎమర్జెన్సీ గేటు ద్వారా పారిపోయిన సంగతి విధితమే. బుధవారం సాయంత్రం ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పెంచికలపేట గ్రామానికి చెందిన కమ్మటి వెంకటేష్ , గోదావరిఖని ఏరియా కు చెందిన రేవెల్లి కొమురయ్య, బేగంపేట గ్రామానికి చెందిన బొమ్మ గాని రాజశేఖర్, రామగుండానికి చెందిన భావండ్ల శ్రీకాంత్ ల పై అనుమానం వచ్చి వారిని పట్టుకుని విచారించగా మేడారం టన్నెల్ లో కాపర్ వైర్ దొంగతనం చేసింది తామేనని ఒప్పుకున్నారు. అనంతరం వీరిని నంది మేడారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు సతీష్, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


