UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 ఇద్దరిని చంపేసిన ఎలుగుబంటి.. ఆ ఊరిలో భయం భయం..!

శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోయారు. అనకాపల్లి గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది.

ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి..పరిశీలించారు.

ఎలుగుబంటి దాడి గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామం విడిచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లకూడదు.. గుంపు గుంపుగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే ఎలుగుబంటిని పట్టుకుంటామని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest