UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 అతను చాలా డేంజరస్ క్రికెటర్.. డగౌట్లో ఎందుకు కూర్చోబెట్టారు..?

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ప్లేయర్ పృథ్వీ షా గురించి తెలియని వారుండరు. క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్స్ లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతాడు.

అలాంటిది.. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అతను మ్యాచ్ ల్లో కనపడటం లేదు. కేవలం డగౌట్ కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ ఆటగాడు రికీ భుయ్ కు అవకాశం కల్పించారు.

గురువారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో ఢిల్లీకి ఇది రెండో ఓటమి. అయితే.. జట్టులో పృథ్వీ షాకు స్థానం కల్పించకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తప్పుబట్టారు.

పృథ్వీ షా మంచి ఆటగాడు.. అతనికి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉంది. అలాంటిది.. డగౌట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. గత సీజన్ లో రాణించలేకపోయినప్పటికీ.. ఈ సీజన్ లో కూడా రాణించలేడన్న నమ్మకం ఏముందన్నాడు. డగౌట్ లో కూర్చోపెడితే ఏమస్తుంది.. క్రీజులోకి పంపితేనే కదా సత్తా తెలిసేదని మూడీ పేర్కొన్నాడు. పృథ్వీ షా చాలా డేంజరస్ క్రికెటర్.. అతనికి అవకాశాలు ఇవ్వలన్నాడు. కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. ఆ మ్యాచ్ లోనైనా పృథ్వీ షాకు అవకాశమిచ్చి తొలి విజయాన్ని నమోదు చేస్తారో లేదో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest