టీఎస్ యుటిఎఫ్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ఎస్ శైలజ పిలుపునిచ్చారు.భద్రాచలం ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా మహిళా కార్యదర్శి టి చిన్నక్క అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, సాధికారత, సమానత్వంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని మండలాల నుండి మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్,భద్రాచలం అధ్యక్షులు కొమరం శ్రీనివాస్, మండల కోశాధికారి ఎస్ ఆశాలత, దుమ్ముగూడెం అధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శులు నర్మదా,నాగమణి, కె నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6