UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా.?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఒకటి. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ఇండియన్‌ రైల్వే.

లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ దేశంలో ఎక్కువ అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా కూడా ఇండియన్‌ రైల్వేకు పేరుంది. అయితే ఇన్ని విశేషాలు ఉన్న భారతీయ రైల్వే ఎన్నో వింతలకు కూడా నెలవుగా ఉంటుంది.

తాజాగా ఇలాంటి ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ పర్వదినానికి ముందు రోజు జరిగిన ఈ సంఘటన అందరి దృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబై-వారణాసి కామయాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణీ మహిళ ప్రయాణం చేసింది. అయితే ఇదే సమయంలో పురిటి నొప్పులు రావడంతో కదులుతోన్న రైలులోనే ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సదరు మహిళ తన భర్తతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సత్నాకు రైలులో బయలుదేరి వెళ్లారు.

అయితే అదే సమయంలో మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అదే కోచ్‌లో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు సాయంగా నిలిచారు. రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించగా ఆర్‌పీఎప్‌ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో వెంటనే రైలును విదిషా రైల్వే స్టేషన్‌లో ఆపి డెలివరీ చేశారు. ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వగా. ఆ చిన్నారికి కుటుంబ సభ్యులు కామయని అని నామకరణం చేయడం విశేషం. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest