UPDATES  

NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

 చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా.?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఒకటి. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ఇండియన్‌ రైల్వే.

లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ దేశంలో ఎక్కువ అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా కూడా ఇండియన్‌ రైల్వేకు పేరుంది. అయితే ఇన్ని విశేషాలు ఉన్న భారతీయ రైల్వే ఎన్నో వింతలకు కూడా నెలవుగా ఉంటుంది.

తాజాగా ఇలాంటి ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ పర్వదినానికి ముందు రోజు జరిగిన ఈ సంఘటన అందరి దృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబై-వారణాసి కామయాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణీ మహిళ ప్రయాణం చేసింది. అయితే ఇదే సమయంలో పురిటి నొప్పులు రావడంతో కదులుతోన్న రైలులోనే ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సదరు మహిళ తన భర్తతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సత్నాకు రైలులో బయలుదేరి వెళ్లారు.

అయితే అదే సమయంలో మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అదే కోచ్‌లో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు సాయంగా నిలిచారు. రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించగా ఆర్‌పీఎప్‌ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో వెంటనే రైలును విదిషా రైల్వే స్టేషన్‌లో ఆపి డెలివరీ చేశారు. ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వగా. ఆ చిన్నారికి కుటుంబ సభ్యులు కామయని అని నామకరణం చేయడం విశేషం. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest