UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు..

వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏక కాలంలో దాడుల నిర్వహణ

హనుమకొండ/ఖమ్మం(తెలంగాణవాణి):

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఈ దాడులు కలకలం సృష్టించాయి.

తహసిల్దార్ నాగేశ్వరరావు స్వస్థలం అయిన హనుమకొండలోని చైతన్యపురిలో, అలాగే ఖమ్మం జిల్లాలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఖిలా వరంగల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు, కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్‌పర్తి, కాజీపేట తహసిల్దార్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈ ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest