టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు ఆదివారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులు తాండ్ర బుచ్చిబాబు,తాండ్ర నాగబాబు, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, ఉపసర్పంచ్ ఎర్రబడీ శ్రీను, వార్డు సభ్యులు శ్రీకాంత్,మాజీ సర్పంచ్ తాడూరి రజాక్, పొదిలి వెంకటాచలం (చిన్న) తదితరులు పాల్గొని ముస్లిం సోదరీ మణులకు రంజాన్ తోఫా అందజేశారు.రంజాన్ మాసం సందర్భంగా అవసరమైన కుటుంబాలకు సహాయం చేయడం ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.
Post Views: 9