UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 స్థానికంలో విజయ డంకా మోగించాలి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి విజయ డంకా ముగిస్తుందని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ధర్మారం మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు తలుపులు బద్దలు కొడతామని ఎంపీపీ జడ్పిటిసి లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు దేశవ్యాప్తంగా హర్షిస్తున్నారని తెలిపారు. జెడ్పిటిసి,ఎంపీపీ తో పాటు సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలను అధిక సంఖ్యలో కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి అధ్యక్షత వహించగా భాజపా సీనియర్ నాయకులు మేడ వేణి శ్రీనివాస్, సంధినేని లక్ష్మణ్, గోనె సాయి, వేల్పుల తిరుపతి, దేవి కొమురేష్, కొలిపాక మణికంఠ, మామిడి చెందు, కర్రె లక్ష్మణ్, జంగిలి రాజయ్య, రేండ్ల శ్రీనివాస్, పల్లె లక్ష్మణ్, దేవి రజనీకాంత్, గుమ్ముల తిరుపతి, బత్తుల కుమార్, కాల్వ కుమార్ రాజు, దంత రాజన్న అత్తిరి పత్తిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest