UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 ప్రొఫెషనల్ హస్తకళాకారులు రాజస్థానీలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి)

వినాయక చవితి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది రకరకాల ఆకృతిలొ కనిపించే గణనాథుల విగ్రహాలు… వాటిని తయారు చేయడంలో రాజస్థానీలకు ప్రత్యేకత ఉంది. కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గత మూడేళ్లుగా రాజస్థానీలు ఇక్కడ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వివిధ రకాల గణనాథుల విగ్రహలను ఆకర్షణీయంగా తయారు చేస్తు ఉపాధి పొందుతున్నారు. ధర్మారం చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది మంది భక్తులు వీరి వద్ద విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఈ విగ్రహాల కోసం సుదూరంలో ఉన్న కోరుట్ల, మెట్ పల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లి విగ్రహాలను తీసుకువచ్చే క్రమంలో సమయంతో పాటు ఖర్చు పెరిగేదని ప్రస్తుతం ధర్మారం మండల కేంద్రంలో గణపతుల విగ్రహాల తయారీ నిర్వాహకులు ఉండటం భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఖర్చు కూడా ఆదా అవుతుందని స్థానికులు అంటున్నారు. ఏడాదంతా పెట్టుబడి పెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి తయారుచేసిన గణనాథుల విగ్రహాల వల్ల వచ్చే ఆదాయంతో కుటుంబం వెళ్లదీస్తున్నామని రాజస్థానీ కళాకారుడు బాబులాల్ అంటున్నారు. వీరి కళలను ఈ ప్రాంత ప్రజలు ప్రశంసిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest