UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 జాతీయ జెండాకు అవమానం

తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయులు
జూలూరుపాడు (తెలంగాణ వాణి)

జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ఎంపిపిఎస్ పాఠశాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించారు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వారే జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటని వెంటనే జాతీయజెండా తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయుల పై పలువురు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారత దేశానికి ఎందరో మహాత్ముల ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న స్వాతంత్ర చిహ్నాన్ని విద్యా వంతులైన ఉండి తల కిందులుగా ఆవిష్కరించడం విమర్శకు కారణమైంది. బాధ్యత గల విద్యావంతులు జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం వహించడం భారత దేశానికే అవమానమని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest