మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

సుజాతనగర్ లో అంబరాని అంటేలా సంబరాలు విజేతలకు బహుమతులు అందించిన తోట దేవిప్రసన్న, ఆళ్ల మురళి సుజాతనగర్ / కొత్తగూడెం (తెలంగాణ వాణి) బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సుజాతనగర్ లో ఆదివారం సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు’ భద్రాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా […]
బతుకమ్మ సంబరాలు జయప్రదం చేద్దాం : తోట దేవిప్రసన్న

నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు కొత్తగూడెం (తెలంగాణ వాణి) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపనున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తెలిపారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ […]
దేవిమాత మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) ధన్ పాల్ లక్ష్మీబాయ్ అండ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ డీ ఎస్ ఎన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్ చైర్మన్ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేవి నవరాత్రుల సందర్బంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.గత 11 ఏళ్ల నుండి తన […]
జర్నలిస్టు సాంబపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: డీజీపీ ని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిది) ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న జర్నలిస్టులపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గం అని టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1) ఏ మీడియా స్వేచ్ఛ హక్కును హరించే దిశగా ఇటు ప్రభుత్వం అటు పోలీసులు ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో యూరియా […]
దర్శనం సాయి ప్రణవ్ కు డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో రెండు గోల్డ్ మెడల్స్

సికింద్రాబాద్ (తెలంగాణ వాణి) హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో తార్నాక డివిజన్ లాలపేటకి చెందిన దర్శనం సాయిప్రణవ్ మొదటి స్థానంలో నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్య వారికి 500, 1000 మీటర్ల రేసింగ్ పోటీలను మొయినాబాద్ లో నిర్వహించారు. ఈ రెండు పోటీలలో సాయి ప్రణవ్ మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు […]
రోజువారీ జీవితంలో హిందీ యొక్క ఔచిత్యాన్ని తెలిపిన ప్రిన్సిపాల్ రావూరి నివేదిత
శ్రీ చైతన్య స్కూల్, ఖమ్మం–1 బ్రాంచ్లో శనివారం హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.హిందీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, ప్రేరణాత్మక గీతాలు,పాత్ర ధారణలు,కథా వివరణలు ప్రదర్శించారు. మీరాబాయి, కబీర్ దాస్,రహీమ్ తదితర కవుల వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.ప్రిన్సిపాల్ రావూరి నివేదిత మాట్లాడుతూ హిందీ ఎలా రాష్ట్ర భాషగా,రాజ్య భాషగా అవతరించిందో తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య,డీజీఎం చేతన్,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్,డీన్ […]
నరసింహుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి) హుజూర్ నగర్ పరిధి ముక్త్యాల కెనాల్ కాలువ ప్రక్కన గుట్టమీద స్వయంభుగా వెలసిన శ్రీ పడగరాయ గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆ స్వామి మహిమలు అంతా ఇంతా కాదు పల్లె పల్లెనా గ్రామ గ్రామాన మారు మ్రోగు తున్న నామస్మరణం నరసింహునిది ఆ స్వామి మహిమలు చూడ ప్రజల తాండోపతండపగా తరలివస్తున్నారు ప్రతి శుక్రవారం స్వామి వారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు […]
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్,కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్య పరిష్కరించాలని,అందరిని పర్మినెంట్ చేయాలని, ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం జీతాలు చెల్లించాలని,పలు డిమాండ్లతో కూడిన నిరావధిక సమ్మెను చేపట్టారు.నెలకు రూ.26వేలు పొందే కార్మికుడి వేతనం.. రూ.11,700కు తగ్గించడం బాధాకరం.ఈ కార్యక్రమంలో సరిత,ద్వాలీ,సీతా,సమ్మక్క,ముత్తమ్మ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చెయ్యండి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 12 : (తెలంగాణ వాణి ప్రతినిధి) సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన […]
పర్యావరణ పరిరక్షణకై ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహన్
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మూడు సవంత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మంగళవారంరోజు పాల్వంచలో గల అయ్యప్పస్వామి దేవాలయం ఆవరణంలో ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయులు బాలుతో సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హరినాథ్ తో కలిసి రుద్రాక్ష మొక్కలు నాటారు.