ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్
టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు ఆదివారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులు తాండ్ర బుచ్చిబాబు,తాండ్ర నాగబాబు, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, ఉపసర్పంచ్ ఎర్రబడీ శ్రీను, వార్డు సభ్యులు శ్రీకాంత్,మాజీ సర్పంచ్ తాడూరి రజాక్, పొదిలి వెంకటాచలం (చిన్న) తదితరులు పాల్గొని ముస్లిం సోదరీ మణులకు రంజాన్ తోఫా అందజేశారు.రంజాన్ మాసం సందర్భంగా […]
ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు,మహాతత్వవేత్త కారల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు అన్నారు.మార్క్స్ 143వ జయంతిని శనివారం సుగుణ గార్డెన్స్లో ఘణంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటనికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్క్స్ ప్రతిపాదించిన సమానత్వభావాలు శ్రమ జీవుల హక్కుల కోసం చేసిన సిద్ధాంత పోరాటం ప్రపంచ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు.సమాజంలో అసమానతలను తొలగించి నమాన హక్కులు సాధించాలన్న లక్ష్యంతో ఆయన చేసిన […]
పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు ప్రముఖుల హాజరు
పాల్వంచ పట్టణ పరిధిలోని జగ్గుతండా నవభారత్ ఏరియాలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు బంజారా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్, గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్ హాజరయ్యారు.టోర్నమెంట్ నిర్వాహకులు లావుడియా గణేష్, బానోత్ ప్రతాప్, గుగులోత్ సేవ్య, యన్ పర్షి, గుగులోత్ బాలు, భూక్యా రమేష్ ఆహ్వానం మేరకు వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు ఒత్తిడిని తట్టుకునే […]
బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి
AISF రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF నాయకులు వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ తెలంగాణలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.9,300 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు […]
సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు
సుజాతనగర్ మండలం సర్వారాం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్పంచ్ తండాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుభ్రత పనులు నిర్వహించారు. సర్పంచ్ భూక్యా సునీత ఆదేశాల మేరకు డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా సర్పంచ్ పర్యవేక్షణలో 5వ వార్డులో డ్రైనేజీ పనులను పారిశుధ్య కార్మికులు పూర్తి చేశారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం
అశ్వాపురం మండలం గొందిగూడెం బండ్ల సత్తయ్య గుంపు లో గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదులు,టాయిలెట్ నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు.అనంతరం పాఠశాలలో మినీ ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడంపై ఐటిడిఏ ఈఈ మధుకర్, ఏఈ ప్రసాద్లను ఎమ్మెల్యే అభినందించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు
పాల్వంచ మండలంలో ఎంపిపిఎస్ పాఠశాల రాజాపురంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో రోజు పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల సమీపంలోని కాలువలు, డ్రైనేజీలు మూసుకుపోవడంతో నిల్వైన నీటిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి శుభ్రపరచి నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సెక్రటరీ శ్రీనివాస్,పాఠశాల ఉపాధ్యాయులు, హెల్త్ వర్కర్లు, గ్రామస్థులు మరియు స్థానిక […]
ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని సర్పంచ్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు కొత్తగూడెం క్లబ్లో జరిగిన సర్పంచ్లు ఈ శిక్షణకు లక్ష్మీదేవిపల్లి మండల సర్పంచ్ లు తాటి అనిత శిక్షణ మెటీరియల్ ను అందుకొని హాజరయ్యారు.ఈ సందర్భంగా శిక్షణకు అవసరమైన మెటీరియల్ను ఎంపీఓలు శ్రీనివాస్ అందజేశారు.
ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు
పాల్వంచ మండలం రాజాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పాఠశాల ఆవరణ భద్రతను పెంచడంతో పాటు పర్యావరణాన్ని అందంగా మార్చే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు.ప్రహరీ గోడ నిర్మాణం పూర్తైన తర్వాత పాఠశాల పరిసరాలు మరింత భద్రంగా,శుభ్రంగా మరియు సుందరంగా మారనున్నాయి.పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామపంచాయతీ పాలక పక్ష సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం
మాజీల వ్యవహారం నవ్విపోదురు గాక మాకేంటి అన్నట్టుగా ఉంది. సంఘానికి వెన్నుపోటు పొడిచి, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని సంఘం నుండి బహిష్కరణకు గురైన వారు ఇప్పుడు మరో సంఘంలో చేరి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీపై ఉన్న ఆరోపణలకు సమాధానాలు చెప్పకుండా వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల నుండి వసూలు చేసిన బిల్డింగ్ ఫండ్ మొత్తం ఎంత, మండలాల వారీగా ఎంత వసూలు చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? […]