UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 జాతీయ జెండాకు అవమానం

తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయులు
జూలూరుపాడు (తెలంగాణ వాణి)

జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ఎంపిపిఎస్ పాఠశాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించారు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వారే జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటని వెంటనే జాతీయజెండా తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయుల పై పలువురు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారత దేశానికి ఎందరో మహాత్ముల ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న స్వాతంత్ర చిహ్నాన్ని విద్యా వంతులైన ఉండి తల కిందులుగా ఆవిష్కరించడం విమర్శకు కారణమైంది. బాధ్యత గల విద్యావంతులు జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం వహించడం భారత దేశానికే అవమానమని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest