రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం
శ్రీరామనవమి సందర్భంగా గోపతండలోని లాలు దాస్ మఠం వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఊరి పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.భజనలు,పూజలు, హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులందరికీ సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని సాక్షిగా లాలు దాస్ ఆశీర్వదించాలని మనసారా ఆకాంక్షించారు.
రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం ఏరియా హాస్పిటల్లో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని,ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.జె. బాలు మాట్లాడుతూ ఇప్పటివరకు 46,500 మందికి రక్తం అందించామని,ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత ఉండేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేశారు.ఈ […]