వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట
సర్వారం గ్రామ పంచాయతీలో శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట మరియు ద్వజస్తంభం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CPI పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సునీత రాంబాబు, భూక్యా శ్రీనివాస్, ఆలయ పూజారి మిట్టు స్వామి, లావుడియా వినాయక్, హథీరాం తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో […]
టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం
భద్రాచలం: టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ తరఫున మండల విద్యాధికారి తోటమళ్ళ రమ గారికి ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం అందించారు. వేసవిలో ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 3 ELS మంజూరు చేయాలని, పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి 2 CCLలు ఇవ్వాలని కోరారు. జనగణన 2026 విధులకు సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయాలని, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.ఎంఈఓ రమ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో […]
కొత్తగూడెంలో నయా ల్యాబ్ దందా ?

భయపెట్టి ఆపరేషన్లకు ఒత్తిడి అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు డాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) కొత్తగూడెం పట్టణంలో కొన్ని ప్రైవేట్ ల్యాబ్ల నిర్వాహకుల తీరు రోగుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ ఆరోగ్య సమస్యలను కూడా అత్యవసరంగా చూపిస్తూ, అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి సాధారణ కడుపునొప్పి తో కొత్తగూడెంలోని […]