బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం
బండపల్లి, మార్చి 09 (తెలంగాణ వాణి ప్రతి నిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒక సామాన్య కుటుంబం తమ గూడును, అందులోని సర్వస్వాన్ని కోల్పోయింది. ప్రమాద వివరాల్లోకి వెళ్తే… గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన మంజాల శేఖర్ (తండ్రి లక్ష్మయ్య నాగేశ్వరరావు) నివాసంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. స్థానికులు మంటలను […]