UPDATES  

స్మశాన వాటికలో పిచ్చి మొక్కల తొలగింపు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిది) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని న్యూ కొత్తపల్లి గ్రామంలోని స్మశాన వాటికలో రెండేళ్లుగా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్లతో అక్కడికి వచ్చే వారికి అసౌకర్యంగా ఉండటంతో గమనించిన స్థానిక సర్పంచ్ నందాల మల్లేశం, కార్యదర్శి ప్రశాంత్ తో కలిసి మంగళవారం ట్రాక్టర్ బ్లేడ్ బండితో స్మశాన వాటిక ఆవరణ చుట్టు శుభ్ర పరిచారు. ఈ పనుల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.