బోథ్ మార్కెట్ లొ సొయా, మొక్కజొన్న కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేత

బోథ్ (తెలంగాణా వాణి) బోథ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ లోని సోయ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రములో అధిక మొత్తములో పంట నిలువ ఉండటంతో రేపటి నుండి అనగా నవంబర్ 22 నుండి 24 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ భొడ్డ గంగారెడ్డి, సెంటర్ ఇంచార్జి గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 25 తేదీ నుండి కొనుగోలు చేస్తామని రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ను ప్రశంసించిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా” నవీన్ నికోలస్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ప్రత్యేకంగా హైదరాబాద్ పిలుచుకొని సన్మానించినట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మారం ఆదర్శ పాఠశాలలో సెప్టెంబర్ నెల 2024వ తేదీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నూతన ఆలోచనలతో విద్యార్థులకు అన్ని రకాల వసతులు తో కూడిన నాణ్యమైన విద్యను […]