UPDATES  

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్, వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ యధార్థ జీవితాల వాస్తవిక చిత్రణ – కుండి మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఏప్రిల్ 19

NEWS

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్, వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ యధార్థ జీవితాల వాస్తవిక చిత్రణ – కుండి మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఏప్రిల్ 19 మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు ఉపాద్యాయుల సమస్యల పై నిత్యం పరిష్కారం చేసే దిశగా TSTTF.స్పాట్ వాల్యూషన్ డ్యూటీ సమస్యలు పరిష్కరించిన టిఎస్టిపిఎఫ్ సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఏప్రిల్ 7వ తేదీన జిల్లా స్థాయి సైన్స్ అండ్ గణితం క్విజ్ పోటీలు

 సర్కార్ సంచలన నిర్ణయం.. 70 వేల ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..

ఇప్పటికే ఆర్థిక మాంద్యం తీవ్రస్థాయిలో పెరిగింది. కొనుగోళ్ళు నిలిచిపోవడంతో చాలావరకు సంస్థలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నాయి.

ఐటీ సంస్థలైతే అడ్డగోలుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకున్న ఆ సంస్థలు.. ఇప్పుడు మెడపట్టి బయటికి గెంటేస్తున్నాయి.. గతంలో పింక్ స్లిప్ లు ఇచ్చి బయటికి పంపించేవి. కానీ ఇప్పుడు ఒక్క వీడియో కాల్ ద్వారానే “గెట్ లాస్ట్ ఫ్రం హియర్” అంటున్నాయి.. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగులు ఐటి కొలువులు కోల్పోయారు. వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే భయం భయంగానే ఐటీ ఉద్యోగులు కొలువులు చేస్తున్నారు.

ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపి కర్రది మరొకదారని… ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. అర్జెంటీనా దేశంలో ఏకంగా అక్కడి ప్రభుత్వం 70 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా ఆ దేశంలో సంచలనం నమోదయింది. ఇప్పటివరకు లే ఆఫ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ చరిత్రలో తొలిసారిగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడిన దేశంగా అర్జెంటీనా నిలవనుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ వచ్చే ఐదు నెలల్లో 70 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుందామని ఆయన ప్రకటించారు. అయితే ఈ తొలగింపులు అర్జెంటీనా దేశంలో ఉన్న 35 లక్షల ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే తక్కువే అని జేవియర్ మిలీ సమర్ధించుకుంటున్నారు.”ఆర్థిక భారం పెరుగుతోంది. వ్యయ నియంత్రణ చర్యలో భాగంగా మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. కార్మిక సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే సవాల్ లేదని” ఆయన ప్రకటించారు.

అర్జెంటీనా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వేలాదిమంది ఉద్యోగులు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం వారితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 31న ఆ ఒప్పందం ముగుస్తుంది. వాస్తవానికి గత ఏడాది కాంట్రాక్టు ముగిసినప్పటికీ ప్రభుత్వం మూడు నెలలు ఆ గడువు పెంచింది. గడువు పెంచే సమయంలో అర్ధాంతరంగా తొలగిస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పలేదు. దీంతో ఎలాగైనా తమను రెగ్యులర్ చేస్తారని ఆ ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం వ్యయ నియంత్రణ పేరుతో వారిని తొలగించడానికి నిర్ణయించడం సంచలనం కలిగిస్తోంది. అయితే ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే రోజుల్లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేసే ఉద్యమానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించాయి. ఇప్పటివరకు ప్రైవేట్ కంపెనీలే ఉద్యోగులను తొలగించాయి. కానీ చరిత్రలో తొలిసారిగా 70 వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తూ అర్జెంటీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest